ఎన్నికలు ఎప్పటినుంచి?
హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ 10నుంచి మే 10వ తేదీ మధ్యలో ఎన్నికలు జరగవచ్చని మాజీ ఈసీ సలహాదారు కె.జె.రావు తెలిపారు. ఎన్నికల సంఘంలో విబేధాలు కుటుంబ కలహాలాంటివేనని, ఎగ్జిట్ పోల్స్ తో ఎలాంటి నష్టం లేదని, దశలవారిగా పోలింగ్ జరిగితే లాభమేనని ఆయన పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్న వారికి టిక్కెట్ ఇవ్వవద్దని, ప్రజలు ఓటు వేయవద్దని మాజీ ఈసీ సూచించారు.
అలాగే లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికల షెడ్యూలు ఈ నెల 26న వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు 26న ముగియనుండడంతో అదే రోజు ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దీన్నిబట్టి రాష్ట్రంలో ఏప్రిల్ రెండోవారంలో తొలి విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నెలాఖరుకు మలి విడత ఎన్నికలు కూడా పూర్తవుతాయని భావిస్తున్నారు.
Comments
Story first published: Monday, February 23, 2009, 11:45 [IST]