మళ్ళీ అరవింద్ భూ వివాదం

Allu Aravind
హైదరాబాద్: గత కొంతకాలంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బావమరిది, గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌కు ఓ న్యాయవాదికి సాగతున్న భూవివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆగిందనుకున్న వివాదం మళ్లీ రాజుకుని..ఇప్పుడు తెరపైకి వచ్చింది. రాజేంద్రనగర్‌ మండలం నార్సింగ్‌ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 163, 164, 165, 131లలో తమకు 14 ఎకరాల పొలం ఉందని..రాహుల్‌ దేవ్‌ అనే వ్యక్తి తమ పొలాన్ని ఆక్రమించుకుంటున్నాడని అల్లు అరవింద్‌ బంధువు కె వసంతలక్ష్మి గత సంవత్సరం డి సెంబర్‌13న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ స్థలం తమదేనని, దాంట్లోకి అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులు అన్యాయంగా ప్రవేశించారని రాహుల్‌దేవ్‌ కౌంటర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగ్‌ పోలీసులు రెండు పక్షాలపైనా కేసులు నమోదు చేశారు. ఎవరి భూమి ఎంత అనే సర్వే నిర్వహించాలని కోరుతూ సీఐ రవిచందన్‌రెడ్డి రాజేంద్రనగర్‌ తహశీల్దార్‌ను కోరగా రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. స్థలాల పత్రాలను, పహాణిలను క్రయవిక్రయదారుల వివరాలను తహశీల్దార్‌ పోలీసుస్టేషన్‌కు పంపించారు. దీనిపై సీఐని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా రెవెన్యూ అధికారుల నుంచి పత్రాలు వచ్చాయని చెప్పారు.

ఇక ఏ సర్వేనెంబర్లో ఎవరికి ఎంత భూమి ఉంది, ఏ భూమి ఎవరు తీసుకోవాలనే విషయాన్ని ఇరువర్గాలు కోర్టులో తేల్చుకోవాలని, కోర్టు నిర్ణయం ప్రకారం ఎవరి భూమి వారు తీసుకోవాలన్నారు. ఇక ఈ సమయంలో న్యాయవాది రాహుల్‌ దేవ్‌ మీడియాతో మాట్లాడుతూ..అవినీతిరహిత సమాజం స్థాపిస్తామంటున్న చిరంజీవికి వారి కుటుంబసభ్యుల అవినీతి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+