వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ ఏదంటే అదే:జీవిత
హైదరాబాద్ :ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏది చెప్తే అదే చేస్తానని, ఆయన నిర్ణయాల మేరకు నడుచుకుంటానని సినీ నటి,కాంగ్రెస్ నాయకురాలు జీవిత అన్నారు. జీవిత ఈ రోజు వైఎస్ తో సమావేశమయ్యారు. సిఎం క్యాంపు ఆఫీసులో ఆమె వైఎస్ను కలుసుకుని పార్టీ ప్రచారం, ఎన్నికల్లో పోటీకి సంబంధించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కబురు పంపితే వెళ్ళానని ఎన్నికల్లో ఎక్కడెక్కడ, ఏ విధంగా ప్రచారం చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. పార్టీ టికెట్టు గురించి తానేమి అడగలేదని ఒకవేళ ఎన్నికల్లో పోటిచేయమంటే సిద్దమేనని ఆమె స్పష్టం చేశారు.
Comments
Story first published: Sunday, March 8, 2009, 16:15 [IST]