వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప నుంచి పోటీ: వైఎస్‌ జగన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
ప్రొద్దుటూర్‌: వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం జగన్‌ ప్రొద్దుటూరులో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. కడపలో ఆయన 10 రోజుల పాటు రోడ్‌షో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపించి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

జగన్ పోటీ చేసేందుకు వీలుగా సిటింగ్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి తాను ఈసారి పోటీ చేయడం లేదని ప్రకటించారు. సాక్షి సహా వివిధ భారీ వ్యాపారాల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం అనుకూల పత్రికల ప్రచారం కారణంగా ఒక దశలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదనుకున్నారు. కానీ ఆ పత్రికల దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా, ప్రజలకు సేవ చేయడానికి కడప లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేయనున్నట్టు ఆయన తన సొంత పత్రికలో రాసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X