హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మవరపుపై ఇసికి ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

dharmavarapu Subramanyam
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఉన్న ధర్మవరపు సుబ్రమణ్యానికి కాంగ్రెస్‌ ప్రచార కమిటీలో స్థానం కల్పించటాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఈరోజు ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టులో ఉన్న వ్యక్తి పార్టీ తరపున ప్రచారం చేయటం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని వారు ఆరోపించారు.

ధర్మవరపు సుబ్రమణ్యంతోపాటు ప్రెస్‌ అకాడెమీ ఛైర్మన్‌గా ఉన్న అమర్‌ సాక్షి ఛానల్‌లో ఇతర పార్టీలను కించపరుస్తూ యాంకరింగ్‌ చేయటంపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్మవరపు, దేవులపల్లి కేబినెట్ ర్యాంక్ పదవుల్లో ఉండి ముఖ్యమంత్రికి చెందిన సాక్షి చానల్ లో పనిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌లు నిర్వహించటంపై కూడా ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X