హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం రమేష్ దౌత్యం: దిగొచ్చిన కెసిఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడైన సిఎం రమేష్ దౌత్యం ఫలించింది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తిరిగి చర్చలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబుతో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ సమావేశం కానున్నారు. సిఎం రమేష్ దౌత్యం ఫలించడంతో కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్నిరద్దు చేసుకున్నారు.

మహాకూటమి నుంచి విడిపోయి పోటీ చేస్తామా, కలిసి పోటీ చేస్తామా అనే విషయాన్ని వెల్లడించడానికి కెసిఆర్ ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అనంతరం కెసిఆర్ మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం కెసిఆర్ మీడియా సమావేశం ఉంటుందని తెరాస ప్రతినిధి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X