నేనేమీ అలగలేదు: జూ. ఎన్టీఅర్
నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని మామయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారని, ఆ మేరకే తాను కొద్ది రోజులు పర్యటనకు విరామం ఇస్తున్నానని ఆయన చెప్పారు. వాహనం అద్దాలు పగిలిపోయాయని, మైకులు కూడా పోయాయని, దాంతో తన గొంతు పోయిందని, పండుగ కూడా ఉందని ఆయన అన్నారు. తాను మళ్లీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గానీ రెండో తేదీ నుంచి గానీ తన పర్యటనను సాగిస్తానని ఆయన చెప్పారు. జూనియర్ ఈ విడత పర్యటన గురువారం సాయంత్రం ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది.
Comments
Story first published: Thursday, March 26, 2009, 8:43 [IST]