ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనేమీ అలగలేదు: జూ. ఎన్టీఅర్

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: అలిగి తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తానేమీ అలగలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తన మిత్రుడు వంశీ మోహన్ కు గన్నవరం శాసనసభా స్థానం ఇవ్వనందుకు తాను అలక వహించి తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయని, ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన వివరించారు.

నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని మామయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారని, ఆ మేరకే తాను కొద్ది రోజులు పర్యటనకు విరామం ఇస్తున్నానని ఆయన చెప్పారు. వాహనం అద్దాలు పగిలిపోయాయని, మైకులు కూడా పోయాయని, దాంతో తన గొంతు పోయిందని, పండుగ కూడా ఉందని ఆయన అన్నారు. తాను మళ్లీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గానీ రెండో తేదీ నుంచి గానీ తన పర్యటనను సాగిస్తానని ఆయన చెప్పారు. జూనియర్ ఈ విడత పర్యటన గురువారం సాయంత్రం ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X