ఎన్టీఆర్ బుడ్డోడు, వైఎస్ గట్టోడు: భవాని
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ ను తిట్టినందుకే బుడ్డోడి (జూనియర్ ఎన్టీఆర్)ని దేవుడు క్షమించలేదని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పురుగులు పడిపోతారని ప్రజలు చెబుతున్నారన్నారు. వైఎస్ది హై వోల్టేజీ బ్యాటరీ అని ఆమె సర్టిఫికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గంగాభవాని మాట్లాడారు. పలు అంశాలపై అనర్గళంగా మాట్లాడారు. ఆమె గతంలో కూడా ఎన్టీఆర్ ను బొడ్డు ఊడని బుడ్డోడు అని అభివర్ణించారు.
ఆ వివరాల్లో ఆమె మాటల్లోనే.."తనకు ఫేస్ వాల్యు లేదని చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ను తెరపైకి తెచ్చారు. ఎన్నికల ప్రచారంలో బుడ్డోడు వైఎస్ను తిట్టారు. వైఎస్ ఊరుకున్నా..దేవుడు క్షమించలేదు. ఇకనైనా ఎన్టీఆర్ మాట్లాడరని అనుకుంటున్నాను. చిన్న ఎన్టీఆర్ ప్రభంజనం చూసి భయం వేసే బాబు తన కొడుకు లోకేశ్ను ముందుకు తెచ్చారు. ఒరిజినల్గా వారందరి బ్యాటరీలు అయిపోయాయి.
ఒక్క జూనియర్ ఎన్టీఆర్ బ్యాటరీ మాత్రమే పనిచేస్తోంది. వాళ్లందరితో పోలిస్తే..వైఎస్ది హై వోల్టేజీ బ్యాటరీ. సూర్యశక్తితో సమానం. జ్యోతిబసులా వైఎస్ కూడా మరో 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలిస్తారు. వైఎస్ ఓ యుగపురుషుడు. కాంగ్రెస్కు ఓటు వేయకపోతే ఐదు వేళ్లతో అన్నం తినే వాళ్లంతా పురుగులు పడిపోతారని ప్రజలు చెబుతున్నారు.
-
రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!!












Click it and Unblock the Notifications