పలు చోట్ల ఇవియంల మొరాయింపు
హైదరాబాద్: రెండో దశ పోలింగ్ జరుగుతున్న జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఇవియంలు మొరాయించాయి. దీంతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే పనిచేయని ఇవియంలను వెంటనే బాగు చేసినట్లు, అంతటా పోలింగ్ సక్రమంగా జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐవి సుబ్బారావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఏలూరు, భీమవరం, కాళ్లమండలంలోని వేంపాడులలో ఈవీఎంలు మొరాయించాయి. పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు ఉదయాన్నే వచ్చి ఏలూరులోని కేపీడీటీ హైస్కూల్లో ఓటు వేశారు. నెల్లూరు జిల్లాలో అధికశాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ రెండుగంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఎంతకీ పోలింగ్ ప్రారంభం కాకపోవటంతో పలుచోట్ల స్థానికులు ఆందోళనకు దిగారు.
చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే 30 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కాళహస్తి, చంద్రగిరి, కుప్పం, తంబళ్లపల్లి మండలాల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పరుచూరు, కనిగిరి, పామూరు, ఒంగోలు, ముక్తి నూతలపాడులలో ఈవీఎంలు చాలాసేపు ఇబ్బందిపెట్టాయి. దీంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కొనకనమిట్ల మండలంలో పోలింగ్ ప్రారంభంలో అల్లర్లు జరిగాయి. చిన్నారికట్లలో టీడీపీ ఏజెంట్వద్ద కొందరు ఫారాలు లాక్కుని పరారయ్యారు. చినమనగుండలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గన్మెన్ జరిపిన కాల్పుల్లో టీడీపీ కార్యకర్త మృతిచెందాడంటూ స్థానికులు గన్మెన్ను నిర్భందించటంతో ఉద్రిక్తద నెలకొంది.
కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఈవీఎంలు పనిచేయక పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బనగానపల్లె నియోజకవర్గంలో ఉదయం 7.30 వరకు పోలింగ్ కేంద్రాలకు యంత్రాలు రాలేదు. కోడుమూరులో ఏ పార్టీ ఏజెంట్లు కూడా రానందున పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గోనెగండ్లలో ఈవీఎంలు మొరాయించాయి.కడప జిల్లాలో ఒక చోట ఉదయం ఇవియంలు మొరాయించినట్లు ఐవి సుబ్బారావు చెప్పారు. రోజా పోటీ చేస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో ఒక చోట 13 మంది ఓటేసిన తర్వాత కొంత మంది ఇవియంలను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. కొత్త ఇవియంలను ఏర్పాటు చేసిన తర్వాత ఆ 13 మందితో కూడా తిరిగి ఓటేయించినట్లు ఆయన తెలిపారు. అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications