లెఫ్ట్ ఆశీస్సులు అవసరం: పవార్

ఈసారి తమకు వామపక్షాల ఆశీస్సులు, మద్దతు అవసరమని ఆయన అన్నారు. వామపక్షాలతో సత్సంబంధాలను కొనసాగించాలని అందుకే తాను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నట్లు ఆయన తెలిపారు. తాము స్థిరమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత వామపక్షాలకు కూడా కూడా దక్కుతుందని ఆయన అన్నారు. మతపార్టీలను ఏ సమయంలో కూడా బలపరచని పార్టీలు వామపక్షాలు మాత్రమేనని ఆయన అన్నారు. గురువారం బారామతిలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మన్మోహన్ సింగ్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకునే హక్కు కాంగ్రెసుకు ఉందని, యుపిఎ తరఫున నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఆర్జెడీ, సమాజ్ వాదీ, ఎల్జెపిలను యుపిఎలోకి తీసుకు రావడానికి తాను ప్రయత్నాలు చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications