వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంచినీళ్ళ కోసం అధికారి ఘెరావ్
వరంగల్: తాగడానికి మంచి నీళ్ళు లేవంటూ వరంగల్ మహిళలు మున్సిపల్ కమిషనర్ ఇంటిని ముట్టడించారు. గంటపాటు ఆయనను దిగ్భందించారు. రెండు రోజులకు ఓ సారి కూడా నల్లాల్లో నీళ్ళు రావటం లేదని, కొళాయిలు సరిగ్గా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీరు రావటంతో రోగాలబారిన పడుతున్నామన్నారు. తక్షణం చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.
Story first published: Wednesday, April 29, 2009, 10:06 [IST]