చెన్నైలో రైళ్ల ఢీ: ఏడుగురు మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. చెన్నైలోని వ్యాసర్పాడిలో లోకల్ రైలు గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జరిగింది. లోకల్ రైలు రాంగ్ రూట్ లో వెళ్లి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో లోకల్ రైలుకు చెందిన ఐదు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. గూడ్స్ రైలును ఢీకొనగానే లోకల్ రైలు బోగీల్లో మంటలు లేచాయి.
మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. క్షతగాత్రులను సమీపంలోని జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. లోకల్ రైలు చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి నిర్ణీత సమయం కన్నా ముందే బయలుదేరిందని, ఆ తర్వాత మూడు స్టేషన్లలోనూ ఆగలేదని తెలుస్తోంది. రైలును బయటివారు ఎవరో నడపడం వల్లనే ఇది జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం నలుగురు మరణించినట్లు, ఆరుగురు గాయపడినట్లు తొలుత సిపిఆర్వో నీలు ఇత్రా చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications