Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా ద్రోహం అదే: అల్లు అరవింద్

Allu Aravind
హైదరాబాద్‌: పరకాల ప్రభాకర్‌ ను పార్టీలోకి తీసుకు వచ్చిన రోజు విషనాగును తెచ్చి పెట్టుకున్నావు ఏదో ఒక రోజు అనుభవిస్తావని సన్నిహితుడు ఒకరు చెప్పినట్లు ప్రజారాజ్యం ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్‌ అన్నారు. పరకాలను పార్టీలోకి తీసుకురావడమే ప్రజారాజ్యం పార్టీకి తాను చేసిన ద్రోహమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. టికెట్లు అమ్ముకున్నారు అని మొదట్లో ఆరోపణలు చేసిన వారిని మెడపట్టుకుని బయటకు గెంటి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. టికెట్ల కోసం డబ్బులు ఇచ్చామని ఎవరైనా చెబితే వారిని చొక్కాపట్టుకుని పీఆర్పీ కార్యాలయానికి తీసుకురావాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని, అది తెలిసి కూడా పెద్దమనుషులు అని చెప్పుకునే పరకాల లాంటి చిన్న మనుషులు అవహేళన చేయడం బాధాకరమని ఆయన అన్నారు. నిజం చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని ఆయన అన్నారు. పరకాల తమను నర్సాపురం టికెట్‌ అడిగాడనడానికి వంద రుజువులు ఇప్పిస్తానని సవాల్‌ విసిరారు. సీట్ల విషయంలో తమ అంచనాలు తప్పాయని అరవింద్‌ అంగీకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+