వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్ కు ఆర్థికం: హోం చిదంబరానికే

By Staff
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ‌: కీలకమైన మంత్రి పదవులను తమ వద్దే ఉంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల, రక్షణ, వాణిజ్య శాఖలను కాంగ్రెసు తన వద్దే ఉంచుకోవాలని ఆలోచిస్తోంది. ప్రణబ్ ముఖర్జీకి ఆర్థిక శాఖను, చిదంబరానికి హోంను, కమల్ నాథ్ కు వాణిజ్యం, కపిల్ సిబాల్ కు హెచ్ ఆర్డీ లేదా విదేశాంగ శాఖలను అప్పగించే అవకాశాలున్నాయి. సుశీల్ కుమార్ షిండే లేదా వి. కిశోర్ చంద్రదేవ్ స్పీకర్ గా నియమితులయ్యే అవకాశం ఉంది.

ఎన్సీపి నేతలు శరద్ పవార్ కు వ్యవసాయ శాఖను, ప్రఫుల్ పటేల్ కు పౌర విమాన యానాల శాఖను అప్పగించే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ రైల్వే శాఖపై కన్నేశారు. అయితే ఆమెకు బొగ్గు, గనుల శాఖ దక్కతుంది. తృణమూల్ కాంగ్రెసుకు చెందిన దినేష్ త్రివేది, సుదీప్ భందోపాధ్యాయ, సుల్తాన్ అహ్మద్, ముకుల్ రాయ్ లకు మంత్రి వదవులు దక్కే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X