వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెసి తెలంగాణ ప్రకటన తప్పు: యాష్కీ

By Staff
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రజలు సమైక్యాంధ్రకే పట్టం కట్టారని తమ పార్టీ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఖండించారు. జెసి ప్రకటన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటనకు విరుద్ధంగా ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై ప్రభుత్వం వేసిన రోశయ్య కమిటీ పని చేస్తుందని వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు.

జెసి ప్రకటన పార్టీ విధానానికి విరుద్ధంగా కూడా ఉందని ఆయన అన్నారు. పార్టీ విధానానికి వ్యక్తిగత ఆలోచనలను కలపొద్దని ఆయన జెసి దివాకర్ రెడ్డికి సూచించారు. కాంగ్రెసు అభిమతం జెసి దివాకర్ రెడ్డి చెప్పిన మాటలకు భిన్నమైందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పిందే అంతిమ నిర్ణయమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X