హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శిక్షణలో చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజారాజ్యం తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ తరగతులకు పార్టీ అధినేత చిరంజీవితో పాటు మిగిలిన 17 మంది ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. అసెంబ్లీకి ఎన్నికైన అభ్యర్థుల్లో చాలామంది కొత్త వారు కావడంతో పీఆర్పీ ఈ తరగతులను నిర్వహించింది. చిరంజీవి ఈ శిక్షణ గురించి చెపుతూ నిపుణులు, పార్టీ సీనియర్‌ నేతలతో వివిధ అంశాలపై ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ప్రజా సమస్యలను సమర్థంగా ప్రస్తావించి, వాటిని పరిష్కరించడానికి శాసనసభ చక్కటి వేదిక అని, ఆ వేదికను తమ పార్టీ పరిపూర్ణంగా వినియోగించుకుంటుందని తెలిపారు. అసెంబ్లీ మాజీ సెక్రటరీ సదాశివరెడ్డి ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరించే తీరుపై సూచనలు ఇచ్చారు. ఈ తరువాత పార్టీ సీనియర్‌ నేతలు కోటగిరి విద్యాధరరావు, టి.దేవేందర్‌ గౌడ్‌, కళావెంకట్రావ్‌ లు కూడా శిక్షణ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X