వైయస్ మారలేదు: కిషన్ రెడ్డి

ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదని, ప్రమోట్ మాత్రమే అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. సీట్ల పరంగా మాత్రమే కాంగ్రెసు పార్టీ గెలిచిందని, నైతికంగా కాంగ్రెసు ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల వోట్లు చీలడం వల్లనే కాంగ్రెసు పార్టీ గెలిచిందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు గతంలో కన్నా వోట్ల శాతం చాలా తగ్గిందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు 36 శాతం వోట్లు మాత్రమే వచ్చాయని, 64 శాతం మంది వోటర్లు కాంగ్రెసును తిరస్కరించారని ఆయన అన్నారు. ఇది కాంగ్రెసు ఓటమి మాత్రమేనని ఆయన అన్నారు.
గవర్నర్ ప్రసంగంలో వేర్పాటువాదం అనే పదాన్ని వాడడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని వేర్పాటువాదంగా చిత్రీకరించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు కుమ్మరించారని, ఈ విషయంలో శాసనసభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. తాను ఒక్క పైసా కూడా వోటర్లకు పంచలేదని ఆయన చెప్పారు. తనపై పోటీ చేసిన మంత్రి డబ్బులు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. పైసా ఖర్చు పెట్టకుండా తాను గెలిచి వచ్చానని ఆయన చెప్పారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications