నేను కొత్త విద్యార్థిని: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: శాసనసభకు తాను కొత్త విద్యార్థిని అని, కళాశాలలో చేరిన కొత్త విద్యార్థి పడే ఇబ్బందులన్నీ తాను పడతానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా ఆయన బుధవారం శాసనసభలో మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతుండగా కొందరు సభ్యులు ఏవో వ్యాఖ్యలు చేయడం గమనించిన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కామెంటరీ వద్దని సూచించారు. దీనికి ప్రతిస్పందించిన చిరంజీవి - తాను కొత్త విద్యార్థిని అని, వారంతా సీనియర్లని, కొత్త విద్యార్థి ఇబ్బందులు తాను పడతానని అన్నారు. ర్యాగింగ్ ను ప్రభుత్వం నిషేధించిందని స్పీకర్ అన్నారు. ఇక్కడ నిషేధించవద్దని, అలా నిషేధిస్తే ఈ మాత్రం ఉల్లాసం ఉండదని చిరంజీవి వ్యాఖ్యానించారు.

తన ప్రసంగంలో చిరంజీవి రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న మంచి నీటి సమస్యను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన అన్నారు. తాము పండుగ చేసుకుంటున్నామని రైతులు అంటున్నప్పుడు మనం మేలు చేసినట్లని ఆయన అన్నారు. రైతులు రోడ్డున పడుతున్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లో తాము సామాజిక న్యాయమనే విత్తనం నాటామని, అది మహా వృక్షం అవుతుందని, ఈ విషయంలో తాము విజయం సాధించామని ఆయన అన్నారు. జలయజ్ఞాన్ని తాము సమర్థిస్తామని, దీని కింద చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది, అవి పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందనేది తెలియదని, అలా కాకుండా ప్రాధాన్యతా క్రమంలో వాటిని చేపట్టాలని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన కాలవ్యవధి గురించి చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+