దాడి చేసినవారిపై చర్యలు: నాగేందర్
హైదరాబాద్: హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో వైద్యులమీద దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి నాగేందర్ తెలిపారు. డాక్టర్లు తమ ఆందోళన విరమించి విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అక్కడ పోలీసు సిబ్బందిని పెంచుతామని చెప్పారు. డాక్టర్ల ఆందోళన కారణంగా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆసుపత్రి అధికారులను కోరారు.
అయితే మంత్రి మాటలకు గాంధీ ఆస్పత్రి జూనియర్ వైద్యులు సంతృప్తి చెందడం లేదు. తమ సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. గర్భిణీ మృతి చెందడంతో ఆమె బంధువులు వైద్యులపై బుధవారం ఉదయం దాడి చేశారు. దాంతో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు.
Comments
Story first published: Wednesday, June 10, 2009, 14:12 [IST]