నన్నెందుకు బదిలీ చేశారు? డిజిపి

దరిమిలా డీజీపీ పదవి నుంచి యాదవ్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలో మహంతిని డీజీపీగా నియమించింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో యాదవ్ మళ్లీ డీజీపీగా పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో డీజీపీగా పక్కకు పెట్టిన ఉత్తర్వులు తనకు అందలేదని, ఆ వివరాలు తెలియజెప్పాల్సిందిగా ఇటీవల యాదవ్ సుబ్బారావుకు మొదట లేఖ రాశారు. దీనికి జవాబుగా డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన ఉత్తర్వు ప్రతిని సీఈఓ కార్యాలయం పంపించింది. డీజీపీగా యాదవ్ ను తప్పించాలన్న తుది నిర్ణయం మాత్రమే అందులో ఉండడంతో..ఎందుకు తప్పించారో కారణాలు వెల్లడి చేయండంటూ డీజీపీ మరో లేఖ రాశారు. ఈసీ నుంచి వచ్చిన లేఖలో ఇంతకంటే వివరాలేమీ లేవని పేర్కొంటూ సీఈఓ కార్యాలయం బదులిచ్చింది. రెండో లేఖకు వచ్చిన సమాధానంపై కూడా సంతృప్తి చెందని డీజీపీ యాదవ్ మూడోలేఖ కూడా సంధించారు. సంతృప్తికరంగా అన్ని వివరణలు ఇచ్చాక కూడా తనని ఎందుకు తప్పించారు? ఆ వివరణలపై ఈసీకి మీరేమి కామెంట్స్ రాశారు? ఆ వివరాలన్నీ చెప్పండంటూ రెండు పేజీల లేఖను సీఈఓ సుబ్బారావుకు రాశారు. ఇంకా మూడో లేఖపై సీఈఓ కార్యాలయం స్పందించలేదు. ఒకట్రెండు రోజుల్లో జవాబివ్వనున్నట్లు తెలిసింది.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications