కెసిఆర్ రాజీనామా ఉపసంహరణ

కార్యకర్తలు, నేతల ఒత్తిడి, ఆందోళనలతో చివరకు ఆదివారం కెసిఆర్ మెత్తబడ్డారు. పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతానంటూ ప్రకటించారు. నాలుగు రోజులుగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్న కెసిఆర్ ఆదివారం రాత్రి మళ్లీ కార్యాలయానికి వచ్చారు. తన కోసం నిరాహార దీక్షలు చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు.
పార్టీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తనను అధ్యక్షుడిగా కొనసాగాలని ఆదేశించిందని, పార్టీ శాసనసభా పక్షం కూడా ముక్తకంఠంతో తన నాయకత్వమే కావాలని తీర్మానించడం వల్లే అధ్యక్ష పదవిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కెసిఆర్ చెప్పారు. మేధావులు, వివిధ ఉద్యమ సంస్థలతోపాటు అమెరికా, లండన్ ల నుంచి తెలంగాణకు చెందిన ఎన్ ఆర్ ఐలు కూడా ఫోన్లుచేసి మాట్లాడారన్నారు. ఎవరో నలుగురు విమర్శలు, ఆరోపణలు చేస్తే మీరు ఉద్యమాన్ని వదిలివేయడం సమంజసం కాదని చెప్పడంతో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్లు చెప్పారు. ఉద్యమాన్ని ప్రాణపప్రదంగా చూసుకుంటానని, రాబోయే 2-3 రోజుల్లో కొత్త కమిటీలను ప్రకటిస్తానని తెలిపారు. పార్టీ నాయకులు ఎవరైనా పార్టీ అంశాలపై స్వేచ్ఛగా మాట్లాడవచ్చని, అయితే ఇది పార్టీ వేదికలకే పరిమితం కావాలన్నారు. తనకు ఎవరిపైనా కోపతాపాల్లేవని చెప్పారు. తనను వ్యక్తిగతంగా అన్నప్పటికీ బాధపడలేదు కానీ, తెలంగాణ ఉద్యమం మలినం అయ్యేలా కొందరు ప్రవర్తించారన్నారు. ఇది మంచిది కాదని పేర్కొన్నారు. కొత్త ఆశయాలు, లక్ష్యసాధన దిశగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని, తనకు వెన్నుదన్నుగా నిలిచి, సంఘీభావం చెప్పిన వారి నమ్మకాన్ని వమ్ముకానీయనని ఉద్ఘాటించారు. ఉద్యమాన్ని అన్ని శక్తుల దాడుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ఉద్యమ సృష్టికర్తగా తనపై ఉందన్నారు.
-
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications