చాముండిపై పోలీసులకు సవిత ఫిర్యాదు
విజయవాడ: లైంగిక వేధింపులు, అక్రమాల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ)కు చెందిన చాముండేశ్వరీనాథ్ పై మహిళా క్రికెటర్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చాముండేశ్వరీనాథ్ పై విజయవాడ నాలుగో టౌన్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. చాముండేశ్వరీనాథ్ పై కిడ్నాప్ ఆరోపణలు కూడా వచ్చాయి. తాను త్రివేండ్రంలో శిక్షణలో ఉన్నప్పుడు తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ప్రసాద్ అనే వ్యక్తి త్రివేండ్రం వస్తాడని, అతను బహుమతి ప్యాక్ ను అందజేస్తాడని, ఇంగ్లాండు పర్యటనకు సంబంధించి వివరాలు చెప్తాడని తనకు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని మహిళా క్రికెటర్ సవితాకుమారి వివరించారు.
ఆ ఫోన్ కాల్ కు భయపడి తాను విశాఖ క్రికెక్ అసోయేషన్ కు తెలిపానని, దీంతో తనను విజయవాడకు తీసుకొచ్చారని ఆమె చెప్పారు. చాముండిపై ఇంతకు ముందు ఫిర్యాదు చేసిన సవితా కుమారి ఆ ఫోన్ కాల్ తనను కిడ్నాప్ చేస్తారనే భయంతో విశాఖ క్రికెట్ అసోసియేషన్ కు ఫోన్ చేసింది. చాముండిపై దుర్గా భవానీ అనే మరో మహిళా క్రికెటర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications