చాముండిపై పోలీసులకు సవిత ఫిర్యాదు
విజయవాడ: లైంగిక వేధింపులు, అక్రమాల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ)కు చెందిన చాముండేశ్వరీనాథ్ పై మహిళా క్రికెటర్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చాముండేశ్వరీనాథ్ పై విజయవాడ నాలుగో టౌన్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. చాముండేశ్వరీనాథ్ పై కిడ్నాప్ ఆరోపణలు కూడా వచ్చాయి. తాను త్రివేండ్రంలో శిక్షణలో ఉన్నప్పుడు తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ప్రసాద్ అనే వ్యక్తి త్రివేండ్రం వస్తాడని, అతను బహుమతి ప్యాక్ ను అందజేస్తాడని, ఇంగ్లాండు పర్యటనకు సంబంధించి వివరాలు చెప్తాడని తనకు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని మహిళా క్రికెటర్ సవితాకుమారి వివరించారు.
ఆ ఫోన్ కాల్ కు భయపడి తాను విశాఖ క్రికెక్ అసోయేషన్ కు తెలిపానని, దీంతో తనను విజయవాడకు తీసుకొచ్చారని ఆమె చెప్పారు. చాముండిపై ఇంతకు ముందు ఫిర్యాదు చేసిన సవితా కుమారి ఆ ఫోన్ కాల్ తనను కిడ్నాప్ చేస్తారనే భయంతో విశాఖ క్రికెట్ అసోసియేషన్ కు ఫోన్ చేసింది. చాముండిపై దుర్గా భవానీ అనే మరో మహిళా క్రికెటర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.