వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధాని చేతికి లిబర్హాన్ కమిషన్ నివేదిక
బాబ్రీ మసీదు కూల్చివేతలో బిజెపి నేత ఎల్ కె అద్వానీ, భజరంగ్ దళ్ పాత్రను నివేదిక వెల్లడించే అవకాశం ఉందని టైమ్ నవ్ అనే టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. కూల్చివేతలో బిజెపి ఇతర నేతల పాత్రను కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైంది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద యెత్తున మత ఘర్షణలు చెలరేగాయి. దీనిపై విచారణ నిమిత్తం ప్రభుత్వం 17 ఏళ్ల క్రితం లిబర్హాన్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ 48 సార్లు పొడగింపులు పొందింది. కమిషన్ కార్యకలాపాలకు 8 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. కమిషన్ 400 సార్లు విచారణ కోసం సమావేశమైంది. ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ వాంగ్మూలాలను సేకరించింది.
న్యూఢిల్లీ bjp బిజెపి manmohan singh chidambaram చిదంబరం మన్మోహన్ సింగ్ అద్వానీ lk advani బాబ్రీ మసీదు babri
Story first published: Tuesday, June 30, 2009, 12:35 [IST]