బ్యాంకు మేనేజర్‌కు మందా క్షమాపణలు

Manda Jagannadham
న్యూఢిల్లీ: బ్యాంకు మేనేజర్‌ రవీందర్ రెడ్డిపై దాడి సంఘటనపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా స్పందించడంతో పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం దిగివచ్చారు. మేనేజర్‌తో పాటు బ్యాంకు ఉద్యోగులకు భేషరతుగా క్షమపణలు తెలుపుతున్నట్లు ఆయన గురువారం ఢీల్లీలో ప్రకటించారు. మేనేజర్‌ రవీందర్ రెడ్డిపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షలేదని తెలిపారు. తమ పార్టీ నేత సోనియా గాంధీ తనను వివరణ కోరలేదని, బాధ్యత గల వ్యక్తిగా తానే సోనియాకు సంఘటన గురించి వివరించానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు వీరప్పమొయిలీతో జగన్నాథం భేటీ అయ్యారు. బ్యాంకు మేనేజర్‌పై దాడి ఘటనపై ఆయనకు వివరణ ఇచ్చారు. మేనేజర్‌ కు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. మందా వ్యవహారంపై ఆధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా సోనియా ఆదేశించారు. పీసీసీ కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అలా ప్రవర్తించి ఉండకూడదని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. దీంతో మందా జగన్నాథం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+