న్యూఢిల్లీ: మార్గదర్శిపై ఆదాయపన్ను అధికారులు సరియైన చర్యలు తీసుకోవడంలేదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లోకసభలో మార్గదర్శి వ్యవహారాన్ని మంగళవారం ప్రస్తావించారు. రెండేళ్లైనా ఈ కేసులో పురోగతి లేదని ఆయన లోకసభలో వాపోయారు. త్వరితగతిన కేసును విచారించి మార్గదర్శిపై చర్య తీసుకోవాలిని ఉండవల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.