హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేద కుటుంబాలను ఆదుకుంటాం: సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: పేద కుటుంబాల జీవనస్థితిగతులు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో సీఎం పాల్గొన్నారు. రాజీవ్‌ గృహకల్ప లబ్దిదారులకు ఇళ్లు మంజూరైన పత్రాలను పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేద కుటుంబాల కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. వారు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. పేద కుటుంబాల పిల్లల ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వివిధ రకాల పనుల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X