వైయస్,బాబు పోటీ వ్యూహాలు

ఇదిలా ఉంటే, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు శుక్రవారం పాదయాత్ర చేస్తూ శాసనసభకు చేరుకుంటారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వారు ఎన్టీఆర్ ఘాట్ నుంచి శాసనసభ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. నిత్యావసర సరుకుల ధరల పెంపు, గోదావరి, కృష్ణా జలాలపై ప్రభుత్వ తీరులను నిరసిస్తూ వారు ఈ పాదయాత్ర చేస్తారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి కె.రోశయ్య శాసనసభలో బడ్జెట్ ను ప్రతిపాదిస్తారు.












Click it and Unblock the Notifications