రాములమ్మపై తెరాస మల్లగుల్లాలు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మల్లగుల్లాలు పడుతోంది. తెరాస పోలిట్ బ్యూరో సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పరిస్థితిపై, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా విజయశాంతి వ్యవహారంపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. విజయశాంతికి షోకాజ్ నోటీసు జారీ చేయాలా, ఏక మొత్తంగా పార్టీ నుంచి బహిష్కరించాలా అనే అంశంపై సమావేశంలో తీవ్రంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. కాగా, తాజాగా రాములు నాయక్ ను పార్టీ నాయకత్వం పోలిట్ బ్యూరోలోకి తీసుకుంది.

తన వ్యవహారం పార్టీని కలవరపెడుతున్నప్పటికీ విజయశాంతి మాత్రం పార్టీపై గానీ, పార్టీ నేత చంద్రశేఖరరావుపై గానీ ఒక్క మాట కూడా జారడం లేదు. తాను ఏం చేయబోతున్నాననే విషయంపై ఆమె సూచనమాత్రంగా కూడా ఏమీ చెప్పడం లేదు. అయితే గతంలో తెరాసలో పని చేసి, వెళ్లిపోయిన తూర్పు జయప్రకాష్ రెడ్డివంటి నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. నరేంద్ర కూడా ఆమెతో శుక్రవారం సమావేశమయ్యారు. ఆమె మాత్రం కాంగ్రెసులోకి వెళ్లడం ఖాయమనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, మరో అసమ్మతి నెత కెకె మహేందర్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 3వ తేదీన కాంగ్రెసులో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+