హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాడ్జిలో 4గురి అనుమానస్పద మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Secunderabad
హైదరాబాద్: సికింద్రబాదు రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో భార్య, భర్త, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు విజయవాడకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ఆరు రోజుల క్రితం వారు ఈ లాడ్జిలో దిగినట్లు తెలుస్తోంది.

వారు ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరైనా వారిని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ప్రసాద్ అనే పేరు మీద లాడ్జిలో మూడు గదులు బుక్ అయినట్లు తెలుస్తోంది. మృతులు ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసి ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X