హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగిసిన బడ్జెట్ సమావేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ముగిశాయి. అసెంబ్లీ మొత్తం 27 రోజులు సమావేశమైంది. మొత్తం 128 గంటల 10 నిమిషాల పాటు సమావేశాలు నడిచాయి. సభలో 220 మౌఖిక ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. సభలో 15 బిల్లులను ప్రతిపాదించగా 14 బిల్లులు ఆమోదం పొందాయి. సమావేశాల చివరి రోజు మంగళవారం ప్రభుత్వం ద్రవ్య వినియోగం బిల్లుకు ఆమోదం పొందింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఆ బిల్లు ఆమోదం పొందింది.

ప్రభుత్వం శాసనసభలో వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. పోలీసు పహారాలో సమావేశాలు నిర్వహించడం దురదృష్టకరమని సిపిఎం శాసనసభా పక్షం విమర్శించింది. ద్రవ్య వినిమయం బిల్లు ద్రవ్య దుర్వినియోగ బిల్లుగా మారిందని వ్యాఖ్యానించింది. సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహిరించిన తీరును తెలుగుదేశం పార్టీ కూడా తప్పు పట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X