Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ బాటలో నడుద్దాం: కెవిపి

KVP Ramachandra Rao
హైదరాబాద్: మనమంతా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు నడుద్దామని వైయస్ సన్నిహిత మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు అన్నారు. గాంధీభవన్ లో పిసిసి ఏర్పాటు చేసిన వైయస్ సంతాపసభలో అల్లరికి దిగిన పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పుతూ ఆయన ఆదివారం ఆ మాటలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్యాయం చేయరని ఆయన అన్నారు.అల్లరి చేయవద్దని కార్యకర్తలను ఆయన మందలించారు. తెలివి తక్కువ పని పల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. వైయస్ ఆత్మకు శాంతి కలగాలంటే అల్లరి చేయవద్దని,మౌనంగా ఉండాలని ఆయన సూచించారు.

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం మినహా పార్టీ అధిష్ఠానవర్గానికి మరో ఆలోచన ఉందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. వైయస్ కు మీ జేజేలు అక్కర్లేదని, ఆయన మనందరి వెంటా ఉంటాడని కెవిపి అన్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వైయస్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన కోరారు. వైయస్ ఆత్మకు శాంతి చేకూరడమే తనకు కావాల్సిందని ఆయన అన్నారు. తమ ఇద్దరి ఆత్మలు ఒక్కటేనని ఆయన అన్నారు. వైయస్ పాదసవ్వడిలో తన జీవితం సాగిందని ఆయన చెప్పుకున్నారు. తాను వైయస్ ఆత్మకు శాంతినే కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కంట తడి పెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+