హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శోభారాణికి ధర్మం కాదు: గౌతం

By Staff
|
Google Oneindia TeluguNews

Shoba Rani
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సినీ నటి రోజాపై మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి చేసిన వ్యాఖ్యలు ప్రజారాజ్యం పార్టీలో దుమారం రేపే అవకాశం ఉంది. శోభారాణి రోజాపై చేసిన వ్యాఖ్యలను ప్రజారాజ్యం పార్టీ నాయకుడు జె. గౌతం ఖండించారు. రోజా కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకోవడం వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలయ్యారని శోభారాణి చేసిన వ్యాఖ్యను ఆయన వ్యతిరేకించారు.

శోభారాణి ఆ విధంగా మాట్లాడడం ఆమెకు మంచిది కాదని, పార్టీకి కూడా మంచిది కాదని గౌతం అన్నారు. రోజాపై వివాదాస్పదమైన, అర్థరహితమైన వ్యాఖ్యలు మంచివి కావని ఆయన అన్నారు. మరింత మంది ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించే అవకాశం ఉంది. ఏది పడితే అది శోభారాణి మాట్లాడుతుందని ఇప్పటికే ఒక అభిప్రాయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X