హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజా కాలు అశుభం: శోభారాణి

By Staff
|
Google Oneindia TeluguNews

Sobha Rani
హైదరాబాద్: తెలుగు సినీ నటి రోజా ఎక్కడ కాలు పెడితే అక్కడ నష్టం జరుగుతోందని ప్రజారాజ్యం అనుబంధ మహిళా సంఘం మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి వ్యాఖ్యానించారు. రోజా తెలుగుదేశం పార్టీలో కాలు పెడితే అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగిందని, ఇప్పుడు వైయస్ ను కలిశారని, వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని, అవన్నీ యాదృచ్ఛిక సంఘటనలే కావచ్చు గానీ ఆమె ఎక్కడ కాలు పెడితే అక్కడ నష్టం జరుగుతోందనేది వాస్తవమని శోభా రాణి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను పరామర్శించిన ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రోజా నడిచి వస్తుంటే నెగిటివ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుందని శోభారాణి వ్యాఖ్యానించారు. తాను నిజానికి హేతువాదినని, రోజా వల్లనే నష్టం జరుగుతోందని తాను అనడం లేదని, అయితే ఆ విధంగా ప్రచారం జరుగుతోందని, అది రోజా దురదృష్టమని ఆమె అన్నారు. వైయస్ దుర్మరణానికి రోజా కాంగ్రెసులో చేరడానికి సంబంధం లేకపోయినప్పటికీ ఆ మచ్చ రోజాపై పడుతోందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X