సమాచారం ఇచ్చేందుకే ఢిల్లీకి: కెవిపి

KVP Ramachandar Rao
హైదరాబాద్: కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి అవసరమైన సమాచారం అందించేందుకు అందుబాటులో ఉండడానకే తాను ఢిల్లీ వెళ్తున్నట్లు దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆత్మీయ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లేందుకు ముందు ఆయన మీడియా ప్రతినిధుల ముందు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ ఒక్క మాటనే అన్నారు. శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన వైయస్ రాజశేఖర రెడ్డి సంతాపసభలో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆ వెంటనే శనివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన వైయస్ జగన్ తో మాట్లాడారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి చివరి ప్రయత్నం చేయడానికే ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. మరోసారి అధిష్ఠాన వర్గానికి చెందిన నాయకులను కలిసి తన వాదనను వినిపించే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో జగన్ ను నాయకుడిగా ఎన్నుకోవడానికి కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం జరుగుతుందని భావించారు. అయితే అది జరగకపోవడం, నాయకుడి ఎంపికలో అధిష్ఠానం తొందరేమిటనే పద్ధతిలో వ్యవహరిస్తుండడం జగన్ వర్గీయులను ఆందోళనకు గురి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+