Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాపై కుట్ర చేస్తున్నారు: చిరు

Chiranjeevi
హైదరాబాద్: తమ పార్టీలో ఏ విధమైన విభేదాలు లేవని, విభేదాలున్నట్లు వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని, కాంగ్రెసులోని ఒక వర్గం ఈ మీడియా కథనాలకు కారణమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా సమర్థుడని తాను అన్నందుకు పార్టీ జగన్ అనుకూల శాసనసభ్యులు మండిపడుతున్నారని వచ్చిన వార్తలను ఆయన బుధవారం ఖండించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా సమర్థుడు కారని ఎవరైనా అనగలరా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ ముఖ్యమంత్రి కావాలని తమ పార్టీలోని శాసనభ్యులు కొంత మంది అనడం కొత్తేమీ కాదని, గతంలో కొంత మంది శాసనసభ్యులు ఆ అభిప్రాయం వక్తం చేశారని, అప్పుడు అది వారి వ్యక్తిగతాభిప్రాయమని చెప్పానని, ఇది కొత్త వార్తేమీ కాదని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవని ఆయన అన్నారు. నాయకత్వ మార్పు విషయం కాంగ్రెసు అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. రోశయ్యను తిరుపతికి ఆహ్వానించడం తన బాధ్యత అని, తాను అదే పని చేశానని ఆయన చెప్పారు.

తిరుపతి నియోజక వర్గంలో కొన్ని సమస్యలున్నాయని, ఆ సమస్యలతో తాను రోశయ్యకు వినతిపత్రం సమర్పించానని, పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం సరి కాదని, అందువల్ల తాను రోశయ్య విషయంలో అలా వ్యవహరించానని, అది తన కర్తవ్యం కూడా అని ఆయన అన్నారు. దానిపై చిలువలు పలువలు సృష్టించడం సరి కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉద్వేగ భరితమైన పరిస్థితి ఏదీ లేదని, ఎవరో కావాలని తమ పార్టీ విషయంలో కుట్ర చేస్తున్నారని, ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తనకు కూడా తెలియదని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+