హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ప్రజాదరణ ఉన్న నేత: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. ఆయన వైయస్ జగన్ నేతృత్వంలోని సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మహానేత మరణం నుంచి రాష్ట్ర ప్రజలు కూడా కోలుకోలేదని ఆయన అన్నారు. తన ఆరోగ్యంపై వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో శ్రద్ధ చూపేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డితో తనకు గల వ్యక్తిగత అనుబంధం గురించి కూడా ఆయన మాట్లాడారు.

డాక్టర్ చదువు పూర్తి కాగానే వైయస్ రూపాయికి వైద్యం అందించారని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైయస్ పని చేశారని ఆయన కొనియాడారు. ప్రభుత్వోద్యోగులను వైయస్ కుటుంబ సభ్యుల్లా చూసేవారని ఆయన అన్నారు. రైతులకు వైయస్ పెన్నిధి లాంటివారని ఆయన అన్నారు. జగన్ ఉత్సాహం, ప్రజాదరణ గల నాయకుడని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X