జగన్ కంపెనీలకు ఐటి నోటీసులు

YS Jagan
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కంపెనీలకు ఆదాయం పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు ఒక తెలుగు దిన పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ వార్తా కథనం తీవ్ర సంచలన కలిగించింది. జగన్ ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెసు అధిష్ఠానానికి ఇది ఆయుధంగా వాడుకునే అవకాశం ఉందని కూడా ఆ దినపత్రిక వ్యాఖ్యానించింది. అంతే కాకుండా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు కూడా ఐటి నోటీసులు జారీ అయినట్లు ఆ పత్రిక రాసింది. ముఖ్యంగా సాక్షి దిన పత్రికను ప్రచురిస్తున్న జగతి పబ్లికేషన్స్ లో భారీ మొత్తాలను పెట్టుబడిగా పెట్టిన పారిశ్రామికవేత్తలకు, ఈ నోటీసులు జారీ అయినట్లు ఆ పత్రిక రాసింది.

ఆ సంస్థలకు పెట్టుబడులను ఏ విధంగా సమీకరించారు, రాబడి మార్గాలేమిటి వంటి వివరాలను స్వయంగా తమ కార్యాలయానికి వచ్చి వివరించాలని ఐటి అధికారులు ఆ కంపెనీలకు సమన్లు జారీ చేసినట్లు ఆ పత్రిక రాసింది. రెండు నెలలుగా ఆ కంపనీలకు సంబంధించిన వివరాలపై కసరత్తు జరిపి ఐటి శాఖ గత వారం ఆ నోటీసులు జారీ చేసినట్లు ఆ వార్తాకథనం వ్యాఖ్య. వైయస్ కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నట్లు తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు గతంలో చేసిన విమర్శలను పత్రిక గుర్తు చేసింది.

ఐటి నోటీసులు అందుకున్నవారంతా హేమీహేమీలేనని ఆ పత్రిక చెప్పింది. ల్యాంకో, పెన్నా, హెటరో డ్రగ్స్, రాంకీ గ్రూప్, అరబిందో ఫార్మా వంటి పలు సంస్థల ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులు, వారికి చెందిన కంపెనీలతో పాటు దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, ఇతర రాష్ట్రాల కంపెనీలు నోటీసులు అందుకున్నట్లు ఆ పత్రిక రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+