జగన్ కే మా వోటు: కొండా సురేఖ

Konda Surekha
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి కోసం తాము వైయస్ జగన్ వెంట ఉంటామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆమె మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్ ను కలిశారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసిన తర్వాతనే తమ వద్దకు రావాలని గ్రామాల్లోని ప్రజలు అంటున్నారని ఆమె జగన్ తో భేటీ అనంతరం అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి కావాలని తాము ఓటేశామని, వైయస్ హఠాన్మరణం తర్వాత వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అంటున్నారని ఆమె అన్నారు. వైయస్ వల్ల పార్టీ అభ్యర్థులు గెలవలేదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి.శంకరరావు చేసిన వ్యాఖ్యపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. దమ్ముంటే శంకరరావు రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆమె సవాల్ చేశారు.

ప్రాథమిక విద్యామంత్రి మాణిక్యవర ప్రసాద్ కూడా జగన్ ను కలిశారు. వరద పరిస్థితిని వివరించడానికి మాత్రమే తాను జగన్ ను కలిసినట్లు ఆయన తెలిపారు. ఇందులో రాజకీయాలేమీ లేవని ఆయన స్పష్టం చేశారు. కర్నూలులో ముఖ్యమంత్రి రోశయ్య కాన్వాయ్ పై ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సిఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిందనేది మీడియా సృష్టేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+