వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్ తో చేతులు కలపం: పవార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sarad Pawar
ముంబై: ఎన్నికల తర్వార రాజ్ థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ తో చేతులు కలిపేది లేదని కేంద్ర మంత్రి, ఎన్సీపి నేత శరద్ పవార్ స్పష్టం చేశారు. తమ పొత్తు బలిష్టంగా ఉందని, తాము ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన బారామతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఎన్ఎస్ మద్దతు అవసరం పడదని, కాంగ్రెసు - ఎన్సీపి కూటమికి పూర్తి మెజారిటీ లభిస్తుందని ఆయన అన్నారు.

ఎన్సీపి, ఎంఎన్ఎస్ లు దగ్గరవుతున్నాయనే వెలువడుతున్న వార్తలు కాంగ్రెసును చిరాకు పరుస్తున్న సమయంలో పవార్ ఆ ప్రకటన చేశారు. రాష్ట్రంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) బలం పెరుగుతోందని, అది బిజెపి - శివసేన బలాలను మాత్రమే దెబ్బ తీస్తుందని, కాంగ్రెసు - ఎన్సీపి ఓటు బ్యాంకును చీల్చలేదని ఆయన అంతకు ముందు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X