వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కష్టాల్లో ప్రజలతో ఉంటా: ప్రిన్స్ మహేష్ బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahesh Babu
హైదరాబాద్: కష్టాల్లో ప్రజలతో ఉంటానని ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు అన్నారు. సినీ నటులు కృష్ణ, విజయనిర్మల దంపతులతో కలిసి మహేష్ బాబు శుక్రవారం ముఖ్యమంత్రి కె.రోశయ్యకు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం సమర్పించారు. మహేష్ బాబు 20 లక్షల రూపాయలు, కృష్ణ, విజయనిర్మల ఐదేసి లక్షల రూపాయలు వరద బాధితుల సహాయం కోసం విరాళం ఇచ్చారు. వారు ముఖ్యమంత్రిని కలిసి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తాను మొన్ననే హైదరాబాద్ వచ్చానని, రాష్ట్రం వరద తాకిడికి గురి కావడం చాలా విచారకరమైన విషయమని ఆయన అన్నారు. వరద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కృష్ణ అన్నారు. తాము వరద బాధితుల కోసం 30 లక్షల రూపాయల విరాళం ఇచ్చామని ఆయన చెప్పారు. వీరి వెంట కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కూడా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X