నేపాల్ రాజకీయాల్లోకి మనీషా కొయిరాల?

Manisha Koirala
ఖాట్మండ్: బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నేపాల్ రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్నికల ద్వారా తొలిసారిగా ప్రధాని పదవిని చేపట్టిన తన తాత బిపి కొయిరాల స్మారకాన్ని ఆమె సందర్శించారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తన తల్లిదండ్రులు సుష్మా, ప్రకాష్ కొయిరాలలతో కలిసి ఆమె తూర్పు ఖాట్మండ్ లోని బిపి స్మారక ప్రదర్శనశాలను సందర్శించారు.

ప్రదర్శనశాలలో రెండు గంటలకు పైగా గడిపిన మనీషా తాను బిపి కొయిరాల మనోభావాలను గౌరవిస్తున్నానని, ప్రదర్శనశాలను సందర్శించిన తర్వాత దేశం పట్ల తన బాధ్యతను గుర్తెరిగానని ఆమె రాసింది. కాశ్మీర్ లో షూటింగ్ లో పాల్గొని ఆమె ఇటీవలే ఖాట్మండ్ వచ్చారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగిందని, రాజకీయాల్లోకి ప్రవేశించిన అమితాబ్ బచ్చన్ ఇతర బాలీవుడ్ నటులంటే తనకు ఇష్టమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+