విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణా జిల్లాలో కాంగ్రెసు నేత హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లాలో రాజకీయ హత్యల పర్వం మళ్లీ మొదలైంది. కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గింజువల్లి వీరయ్యచౌదరిని సోమవారం ఉదయం ప్రత్యర్థులు గొడ్డళ్లతో నరికి దారుణ హత్య చేశారు. నెల రోజుల క్రితం ఎబిసి సంస్థల అధినేత, తెలుగుదేశం నాయకుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ మృతి కేసులో వీరయ్య చౌదరి ప్రధాన అనుమానితుడు.

బుచ్చయ్య హత్యకు ప్రతీకారంగానే వీరయ్యను ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వీరయ్య చౌదరి శవం శివాలయంలో పడి ఉంది. వీరయ్య హత్యకు నిరసనగా కాంగ్రెసు కార్యకర్తలు విజయవాడ - జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X