హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజేశ్వరి ఆత్మహత్య: హైదరాబాద్ లో ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajeswari
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయాధికారి రాజేశ్వరి ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ శాఖ ఉద్యోగులు సోమవారం ధర్నాకు దిగారు. హైదరాబాద్ లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నాకు చేశారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లను తట్టుకోలేక ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒంటిపై కిరోసిన్ పోసుకుని బుధవారంనాడు ఆత్యహత్యా యత్నానికి పాల్పడింది. ఆమె హైదరాబాదులో చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది.

తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి బెదిరింపుల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజేశ్వరి మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. రాజేశ్వరిపై ఒత్తిడి తెచ్చే అవసరం తనకు లేదని, రాజేశ్వరి వివరాలు చెప్తే విన్నానని, తర్వాత వెళ్లిపోయిందని సీతా దయాకర్ రెడ్డి అన్నారు. తానేమీ రాజేశ్వరిపై ఒత్తిడి తేలేదని ఎంపిపి భారతి రెడ్డి అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X