సిఎం పదవి ఎప్పటికైనా వస్తుంది: జగన్

కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా, ఎంపిగా వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. నత్త నడకన ప్రాజెక్టులు నడుస్తున్నాయని, తెల్ల రేషన్ కార్డుల కోసం ఇంకా చాలా మంది నిరీక్షిస్తున్నారని, వీటి విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సోనియా గాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సోనియా గాంధీ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. గత రెండు నెలలుగా తాను మీడియా సమావేశాల్లో పాల్గొనలేదని, ఏ రోజు కూడా తాను ఫలానా పదవి కావాలని అడగలేదని, గత రెండు నెలలుగా తనకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తన వయస్సు కేవలం 36 ఏళ్లు మాత్రమేనని, ఏదో రకంగా ముఖ్యమంత్రి పదవిలోకి పోవడం తన ఉద్దేశం కాదని, మరింత ఎక్కువగా కష్టపడి, మరింతగా ప్రజల మన్ననలు పొందితే ఆ పదవి ఏదో ఒక రోజు వస్తుందని ఆయన అన్నారు. ఏ పదవీ వచ్చినా, రాకపోయినా నిబద్ధత గల కాంగ్రెసు కార్యకర్తగా పని చేస్తానని ఆయన చెప్పారు. సోనియా నాయకత్వాన్ని బలపరుస్తానని, తన వెంట ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, కార్యకర్తలు సోనియా నాయకత్వాన్ని బలపరుస్తారని ఆయన హామీ ఇచ్చారు. 2014లో రాష్ట్రంలో 41 పార్లమెంటు స్థానాలను కాంగ్రెసుకు సాధించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి తాము పని చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్య అయినా, మరొకరైనా తన మద్దతు, తన వారి మద్దతు ఉంటుందని, రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.
పత్రికల్లో వచ్చిన వార్తలు తనను చాలా బాధించాయని, తనకూ సోనియాకూ మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా వ్యక్తిగతమని, సంభాషణ వివరాలను జెంటిల్ మన్ గా బహిర్గతం చేయలేనని, దీన్ని మీడియా అర్థం చేసుకోవాలని, మీడియా సంయమనం పాటించాలని, ఊహాగానాలు రాయవద్దని ఆయన అన్నారు. తన నోటి నుంచి వస్తే తప్ప ఊహించి వార్తా కథనాలు రాయవద్దని ఆయన కోరారు. జగన్ మాట్లాడిన మీడియా సమావేశంలో దానం నాగేందర్, మాణిక్యవరప్రసాద్, డికె అరుణ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి వంటి మంత్రులు, మల్లు భట్టి విక్రమార్క వంటి పార్టీ నాయకులు ఉన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications