న్యూఢిల్లీలో సోనియా గాంధీతో రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు

Sonia Gandhi
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు ఇక ఢిల్లీకి మారనున్నాయి. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ప్రకటించడంతో కాంగ్రెసు అధిష్టానం తదుపరి చర్యలకు నడుం బిస్తోంది. ఇందుకు గాను ముఖ్యమంత్రి రోశయ్యను, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ఢిల్లీ పిలిపించింది. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం, శాసనసభా సమావేశం ఏర్పాటు, మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ తదితర విషయాలపై ఒక కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేసి రోశయ్యకు పూర్తి అధికారాలు కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది.

నేతను ఎన్నుకునేందుకు తప్పకుండా సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి కె. రోశయ్య ఆదివారం సాయంత్రం ఢిల్లీలో చెప్పారు. అయితే తేదీ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. మంత్రివర్గ వునర్వ్యస్థీకరణకు ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛనిస్తారా అడిగితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకా ఎలాంటి ఫార్ములా రూపొందించలేదని, దీనిపై ఇంతవరకు అధిష్టానం స్థాయిలో చర్చలు జరగలేదని ఆయన చెప్పారు. అయితే ఈ నెల 28వ తేదీన సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ తల వంచినట్లు కనిపిస్తున్నప్పటికీ అసమ్మతి రాజకీయాలకు ఆజ్యం పోసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయంతోనే పార్టీ అధిష్టానం ఉంది. ఆయన కార్యకలాపాలను నిశితంగా గమనిస్తోంది. ఈ అసమ్మతి తారాస్థాయికి చేరుకోకుండా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పార్టీ అధిష్టానం డి. శ్రీనివాస్ తోనూ రోశయ్యతోనూ మాట్లాడే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+