హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులో ఇద్దరు విద్యార్థులు విడివిడిగా ఆత్మహత్యలు చేసుకున్నారు. హైదరాబాదులోని సైదాబాద్ లో గల సాయిరాం నగర్ లోని ప్రిన్స్ టన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విజయవాణి అనే విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె రాసి పెట్టిన లేఖను బట్టి తెలుస్తోంది. ఉపాధ్యాయుల వేధింపులు భరించలేని విజయవాణి నాలుగు రోజులుగా పాఠశాలకు కూడా వెళ్లడం లేదని అంటున్నారు.

కాగా, హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శామిర్ పేటలో గల నల్సార్ లా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట్రామారెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. వెంకట్రామారెడ్డి తమిళనాడు రాజధాని చెన్నైకి చెందినవాడని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X