వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జైపూర్ అగ్నిప్రమాదంలో 13 మంది మృతి
సహాయ చర్యలు జరుగుతుండగానే ఐఒసి డిపోలో మరో పేలుడు శబ్దం వినిపించింది. ప్రమాద స్థలానికి పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా చేరుకున్నారు. ప్రమాద నష్టాన్ని తగ్గించడానికి నిపుణులను రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం చాలా పెద్దదని ఆయన అన్నారు. అగ్ని ప్రమాదం ఒక్క డిపోకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర డిపోలకు కూడా పాకింది. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఐదు నుంచి పది లక్షల రూపాయలేసి నష్టపరిహారాన్ని మంత్రి ప్రకటించారు. లీకేజీ వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మంటలు డిపో నుంచి పైప్ లైన్ కు పాకాయి.ఈ ప్రమాదంతో పక్కన ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అగ్ని ప్రమాంద పెట్రోల్ స్టోరేజీ ట్యాంక్ వద్ద సంభవించిందని, ఆ తర్వాత మంటలు ఇతర ట్యాంకులకు వ్యాపించాయని ఐఒసి చైర్మన్ సార్థక్ బహూరియా చెప్పారు.
Comments
Story first published: Friday, October 30, 2009, 9:57 [IST]