వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపూర్ అగ్నిప్రమాదంలో 13 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaipur Fire Accident
జైపూర్: జైపూర్ లోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) డిపోలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది మరణించారు. 150 దాకా గాయపడ్డారు. ఐఒసి చరిత్రలో అత్యంత దారుణమైన ప్రమాదం ఇది. జైపూర్ ఐఒసి డిపోలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మరో ఐదారుగురు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని రాష్ట్ర సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. సైన్యానికి, బొంబాయి హైకి చెందిన బృందాలు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించిన ఐఒసి డిపో విమానాశ్రయానికి సమీపంలో సీతాపుర పారిశ్రామిక వాడలో ఉంది.

సహాయ చర్యలు జరుగుతుండగానే ఐఒసి డిపోలో మరో పేలుడు శబ్దం వినిపించింది. ప్రమాద స్థలానికి పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా చేరుకున్నారు. ప్రమాద నష్టాన్ని తగ్గించడానికి నిపుణులను రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం చాలా పెద్దదని ఆయన అన్నారు. అగ్ని ప్రమాదం ఒక్క డిపోకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర డిపోలకు కూడా పాకింది. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఐదు నుంచి పది లక్షల రూపాయలేసి నష్టపరిహారాన్ని మంత్రి ప్రకటించారు. లీకేజీ వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మంటలు డిపో నుంచి పైప్ లైన్ కు పాకాయి.ఈ ప్రమాదంతో పక్కన ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అగ్ని ప్రమాంద పెట్రోల్ స్టోరేజీ ట్యాంక్ వద్ద సంభవించిందని, ఆ తర్వాత మంటలు ఇతర ట్యాంకులకు వ్యాపించాయని ఐఒసి చైర్మన్ సార్థక్ బహూరియా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X