బెజవాడ రాసలీలల కేసు కీలక మలుపు
ఆ ఇద్దరు ఉద్యోగులు చెబుతున్న మాటలలో పొంత న కుదరకపోవడంతో మరోసారి విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై విచారణకు నియామకమైన దుర్గగుడిలో ఇద్దరు మహిళా అధికారులు కూడా తమ పరిధిలో విచారణ కొనసాగిస్తున్నారు. సంబంధిత ఉద్యోగులనుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. తొలుత సిసిటీవీ కెమెరాలలో సంఘటన రికార్డు అయిందా? లేదా? రికా ర్డు అయితే దానిని తొలగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులిద్దరినీ ఇంతవరకు పిలిపించి మాట్లాడలేదని తెలుస్తోంది. కొత్త ఈవో వచ్చిన తరువాత వారిద్దరినీ పిలిపించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దేవాదాయ శాఖ మాజీ అధికారి ఒకరు దుర్గగుడిలో మొత్తం 18మందికి వివాహేతర సంబంధాలున్నట్లు బహిరంగ లేఖ రాసి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈలేఖను పత్రికలకు, ఎల్రక్టానిక్ మీడియాకు విడుదల చేయడంతో ఒక ఛానల్ ఈ లేఖను ప్రసారం చేసింది. దీనిపై దుర్గగుడిలో మహిళా అధికారులు, ఉద్యోగులు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు లేఖరాసిన మాజీ అధికారిపైన, లేఖను ప్రసారం చేసిన టీవీ ఛానల్ ప్రతినిధులపైనా సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు.