తెలంగాణను సినీస్టార్లు ఏలుతున్నారు: కెసిఆర్

K Chandrasekhar Rao
వరంగల్: మెదక్ జిల్లా సిద్ధిపేటలో తన ఆమరణ నిరాహార దీక్షను ఆపేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు హెచ్చరించారు. దీక్షను అపడానికి ప్రయత్నిస్తే కొరవితో తల గోక్కునేట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో ఆయన సోమవారం ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐకమత్యంగా పోరాడాలని ఆయన పిలువునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు పంచాల్సిన 80 ఎకరాల భూమిని స్టూడియోలకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణ విద్యార్థులు గుజ్జర్ల తరహా ఉద్యమం చేయలేరా అని ఆయన ప్రశ్నించారు.
ఫ్రీజోన్, మా జోన్ అంటూ తెలంగాణ ప్రాంతాన్ని అమ్ముకునేందుకు కాంగ్రెసు నాయకులు దిగజారారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను ఎలుతోంది సినిమా స్టార్లేనని ఆయన విమర్శించారు. తెలంగాణ నాయకులు, శాసనసభ్యులు ఏం తప్పు చేశారని బైండోవర్ కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇదే పద్ధతిని కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+