'చెత్త' సమస్యపై పురంధేశ్వరి దృష్టి

Purandeswari
విశాఖపట్నం: జీవీఎంసీ 'చెత్త' వివాదం కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి దృష్టికి చేరింది. సుమారు పది రోజులుగా బాహాబాహీ అంటూ సవాల్‌ విసురుకున్న మేయర్‌ పులుసు జనార్దనరావు, డిప్యూటీ మేయర్‌ కె.దొరబాబులు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఇంట్లో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి జిల్లాకు చెందిన మంత్రి పి. బాలరాజు కూడా హాజరయ్యారు. కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో వున్న చెత్తను కోరమండల్‌ కంపెనీకి ధారాదత్తం చేయడంలో అక్షరాల వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మహానగర పాలక సంస్థ కౌన్సిల్‌లో ఆరోపణలు చేసిన డిప్యూటీ మేయరు దొరబాబు మరోసారి తన వాదనలకు కట్టుబడి వున్నట్టు వివరించినట్టు తెలిసింది.

చెత్త బదలాయింపుపై కౌన్సిల్‌లో తీర్మానమే చేయలేదని మేయరు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన దొరబాబు స్టాండింగ్‌ కౌన్సిల్‌లో ఆమోదించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వివాదంపై ఇప్పటికే మేయరు, డిప్యూటీ మేయరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో నగరకాంగ్రెస్‌ పరువు రోడ్డున పడింది. దీనిపై ఇన్‌చార్జి మంత్రి కన్నా లక్ష్మినారాయణ, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల వద్ద ఇప్పటికే పంచాయితీ జరిగింది. వివాదం కొలిక్కి రాకపోవడంతో చివరకు పురంధేశ్వరి వద్దకు చేరింది. దీనిపై ఆమె ఎలా స్పందించారన్న దానిపై వివరాలు బయటకు రాలేదు. ఇదిలా వుండగా ఈనెల 25న ముఖ్యమంత్రి రోశయ్య నగర పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నగరానికి చెందిన శాసనసభ్యులు, పార్టీకార్పొరేటర్లతో సమావేశమై చెత్త వివాదానికి తెరదించనున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+